అమెరికా అధ్యక్షుడి హత్యకు యత్నించిన తెలుగు యువకుడికి భారీ శిక్ష

-

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను చంపుతానంటూ వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్‌తో దూసుకొచ్చిన తెలుగు యువకుడు సాయివర్షిత్‌కు(Sai Varshith Kandula) గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫెడరల్ కోర్టు ముందు సాయిని పోలీసులు హాజరుపర్చగా న్యాయమూర్తి రాబిన్ మెరివెదర్ మే30 దాకా కస్టడీ విధించారు. మిస్సోరీ రాష్ట్రంలో నివసించే భారత సంతతికి చెందిన తెలుగు యువకుడు సాయి వర్షిత్ గతంలో డేటా అనలిస్ట్‌గా పనిచేశాడు. అయితే సోమవారం రాత్రి అతడు ఓ భారీ ట్రక్‌ నడుపుతూ శ్వేతసౌధంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నంలో అక్కడున్న బారికేడ్లను ఢీకొట్టాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

అనంతరం అతడి ట్రక్‌ పరిశీలించగా జర్మనీ నియంత హిట్లర్‌కు చెందిన నాజీ పార్టీ జెండా కనిపించింది. బైడన్‌ను చంపి అమెరికా పగ్గాలు చేపట్టడమే తన లక్ష్యమని సాయివర్షిత్(Sai Varshith Kandula) చెప్పాడు. ఆరు నెలల పాటు బైడెన్ హత్యకు ప్లాన్ చేశానని చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. ఆస్తుల విధ్వంసం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, అధ్యక్షుడిని చంపుతానని బెదిరించడం తదితర అభియోగాలు నిందితుడిపై మోపారు. అయితే ఈ కేసులో గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటూ రూ.2కోట్ల జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం.

Read Also:
1. నేనున్నానుగా.. పతిరణ కుటుంబసభ్యులకు ధోనీ భరోసా
2. ప్రతి హీరోకి దేవుడి రూపంలో విగ్రహం పెడితే మరి దేవుళ్లు ఎందుకు?
3. వేసవిలో ఈ ఫుడ్స్ రోజువారీ డైట్ లో చేరిస్తే మంచి బెనిఫిట్స్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...