మూడేళ్ల బాలుడు పామును కొరికి చంపేశాడు 

-

Snake Bite |ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడు పామును నోటితో కొరికి చంపేశాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కొత్వాలి మహ్మదాబాద్ ప్రాంతంలోని మద్నాపూర్‌కు చెందిన దినేశ్‌సింగ్‌కు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.

- Advertisement -

అయితే శనివారం ఆరుబయట బాలుడు ఆడుకుంటున్న సమయంలో ఓ పాము అక్కడకు వచ్చింది. దీంతో బాలుడు ఆ పామును పట్టుకొని నోటితో కొరికి చంపాడు. అనంతరం స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు చనిపోయిన పాముతో పాటు బాలుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే స్పందించి సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

Read Also:
1. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తా

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...