ఒడిశాలో పట్టాలు తప్పిన మరో రైలు

Odisha

బాలాసోర్ రైలు దుర్ఘటన దేశమంతా మరువక ముందే ఒడిశాలో(Odisha) మరో రైలు పట్టాలు తప్పింది. బర్గఢ్‌ జిల్లాలో సున్నపురాయి లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు సంబర్ ధార వద్ద ప్రమాదానికి గురైంది. బర్గఢ్‌ నుంచి దుంగ్రీ ప్రాంతానికి వెళుతుండగా రైలులోని ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏసీసీ సిమెంట్‌ కర్మాగారంలో సున్నపురాయి గనుల నుంచి ప్లాంట్‌కు లోడు తీసుకెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా గత శుక్రవారం బాలేశ్వర్‌ వద్ద మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 270 మందికిపైగా మృతి చెందిన సంగతి తెలిసిందే.

Read Also:
1. మూడేళ్ల బాలుడు పామును కొరికి చంపేశాడు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here