నిరాడంబరంగా కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ కూతురి వివాహం

-

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్(Nirmala sitharaman) కూతురి వివాహం నిరాడంబరంగా జరిగింది. బెంగళూరు నగరంలో గురువారం రాత్రి కొద్ది మంది బంధువులు, కుటుంబసభ్యులు, రాజకీయ నాయకుల సమక్షంలో నిర్వహించారు. జయనగర్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో వివాహ వేడుకలు జరిగాయి. ఉడుపిలోని అదమరు మఠానికి చెందిన పురోహితులు ఈ వివాహం జరిపించారు. పరకాల ప్రభాకర్- నిర్మలా సీతారామన్ కుమార్తె వాజ్ఞయి. వృత్తిరీత్యా జర్నలిస్ట్. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తోన్న ఓ జాతీయ దినపత్రికలో రిపోర్టర్‌గా పని చేస్తోన్నారు. ప్రత్యేకించి- ఆర్ట్, లైఫ్ స్టైల్, టెక్నాలజీ, సాహిత్యం మీద వార్తలను రాస్తుంటారు. ఢిల్లీ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి ఆమె. ఈ ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిగ్రీ, ఇంగ్లీష్ లిటరేచర్‌లో ఎంఏ చేశారు. అమెరికా బోస్టన్, మసాచ్చుసెట్స్‌లో గల నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీలో జర్నలిజంలో ఎంఎస్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘కల్కి2898 ఏడీ’లో కృష్ణుడు ఇతనే..

అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే వంటి అగ్ర నటీనటులు...

Dharmapuri Srinivas | కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి...