లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు రైనా ఆసక్తి

-

టీమిండియా మాజీ క్రికెటర్‌, మిస్టర్‌ ఐపీఎల్‌ సురేష్‌ రైనా(Suresh Raina) లంక ప్రీమియర్‌ లీగ్‌(LPL)లో ఆడేందుకు రెడీ అయ్యాడు. 2023లో జరిగే సీజన్‌ కోసం తొలిసారిగా ఐపీఎల్ తరహాలో నిర్వహించనున్న వేలం ప్రక్రియ జూన్‌ 14న ప్రాంభంకానుంది. 140 మంది అంతర్జాతీయ క్రికెటర్లతో సహా మొత్తం 500 మందికి పైగా క్రికెటర్లు ఈ వేలం జాబితాలో ఉన్నారు. దీంతో ఈ వేలంలో 50,000 డాలర్లు(సుమారు 41 లక్షల 30 వేల రూపాయలు) బేస్‌ప్రైస్‌తో రైనా తన పేరు నమోదు చేసుకున్నాడు. గతేడాది అన్ని రకాల క్రికెట్‌ ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన రైనా(Suresh Raina) విదేశీ లీగ్‌లపై మాత్రం దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే అబుదాబి టీ10 లీగ్‌-2022లో డెక్కన్ గ్లాడియేటర్ తరపున ఆడాడు. ఇప్పుడు మరోసారి లంక లీగ్ ద్వారా అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. కాగా ఈ ఏడాది జూలై 30 నుంచి ఆగస్టు 20 వరకు LPL జరగనుంది.

Read Also:
1. తీరం వైపు దూసుకొస్తున్న బిపోర్‌జాయ్‌ తుపాన్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...