Machilipatnam | హాస్టల్ విద్యార్థినిపై వైసీపీ కార్యకర్త అత్యాచారం?

-

Machilipatnam |ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. హాస్టల్ విద్యార్థినిపై వైసీపీ కార్యకర్త లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతుంది. 13వ డివిజన్‌లోని ప్రభుత్వ హాస్టల్ విద్యార్థినిపై వైసీపీ కార్యకర్త ఆవుల సతీష్(Avula Sathish) లైంగిక దాడికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. హాస్టల్ విద్యార్థినికి మద్యం తాగించి, డ్రగ్ ఇంజెక్షన్ ఇచ్చి సతీష్ అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధిత విద్యార్థినికి వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారానికి గురైనట్లు నిర్ధారించారని తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడు ఆవుల సతీష్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర(Kollu Ravindra) ఏకంగా టీడీపీ కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ కేసును మాఫీ చేసేందుకు వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారని ఆరోపించారు. ఇంత ఘోరం జరిగినా ఇంకా పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అనేదానిపై ఇప్పటికీ వివరణ ఇవ్వడం లేదని కొల్లు రవీంద్ర ఆరోపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
Read Also:
1. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
2. రూ.10 కోసం కక్కుర్తిపడి పోలీసులకు చిక్కిన గజదొంగ

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ మెట్రోకి మరో ప్రతిష్టాత్మక అవార్డు

హైదారాబాద్ మెట్రో(Hyderabad Metro)కి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఇటీవల పని...

‘కల్కి2898 ఏడీ’లో కృష్ణుడు ఇతనే..

అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే వంటి అగ్ర నటీనటులు...