Bandla Ganesh | తెలంగాణలో గెలిచేది ఆ పార్టీనే.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ప్రముఖ నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh) రాజకీయాలపై దృష్టి సారించారు. 2018 వరకు రాజకీయాల్లో యాక్టీవ్‌గా పనిచేసిన బండ్లన్న.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో సైలెంట్ అయిపోయారు. ఎట్టకేలకు మళ్లీ కాంగ్రెస్‌లో యాక్టీవ్ అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర(People’s March Padayatra)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో భారత దేశానికి గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. సోనియా గాంధీ దయతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పారు. కర్ణాటక నుండి హుదూద్ తుఫాన్ మొదలైందని.. తెలంగాణ నుండి గెలుచుకుంటూ ఢిల్లీ వరకు వెళ్లి అక్కడ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు బండ్ల గణేష్(Bandla Ganesh) మద్దతు తెలిపారు.

- Advertisement -
Read Also:
1. వెస్టిండీస్‌ టూర్‌కు సెలక్ట్ అవుతానని ఊహించలేదు: టీమిండియా పేసర్
2. తలలో చుండ్రు తరచూ వస్తుంటే ప్రమాదమా??

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...