Women T20 Match | నేడే బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్‌.. నాలుగు నెలల తర్వాత బరిలోకి!

-

Women T20 Match | క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత మహిళల జట్టు ఈరోజు బరిలోకి దిగనుంది. గత నాలుగు నెలలుగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు ఇప్పుడు బంగ్లాదేశ్‌తో తలపడేందుకు సిద్ధంగా ఉంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. ఆదివారం నుంచి టీ20 సిరీస్‌తో పర్యటనను ప్రారంభించనుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ మిర్పూర్‌లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరగనుంది.

- Advertisement -

Women T20 Match | ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో భారత మహిళల జట్టు తమ చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఓడి, టీ20 ప్రపంచకప్‌ నుంచి మహిళల జట్టు రిక్తహస్తాలతో నిష్క్రమించింది. దీని తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆ జట్టు క్రీడాకారులు పాల్గొన్నారు. అయితే, ఆ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. ఇప్పుడు ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి, సిరీస్‌లోని రెండవ మ్యాచ్ జులై 11న, 3వ మ్యాచ్ జులై 13న మీర్పూర్‌లో జరగనుంది.

Read Also: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద మరో అగ్నిప్రమాదం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...