Talasani | అమెరికా, లండన్‌లోనూ బోనాల జాతర: మంత్రి తలసాని

-

సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలు గ్రాండ్‌గా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వస్తున్నారు. ఈ ఉదయం తొలిబోనం సమర్పించిన మంత్రి తలసాని(Minister Talasani) మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాలు పండుగ ఘనంగా జరుగుతున్నదని అన్నారు. బోనాలు మన సంస్కృతికి ప్రతీకగా నిలలుస్తాయని తెలిపారు. 2014 నుంచి బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పారు. బోనాలను సీఎం కేసీఆర్‌ రాష్ట్ర పండుగగా ప్రకటించారన్నారు. బోనాలను ఘనంగా నిర్వహించుకోవాలి అనే ఉద్దేశంతోనే ఆలయాలకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తున్నదని చెప్పారు.

- Advertisement -

ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్థికంగా సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. బోనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మహంకాళి బోనాల జాతర విశ్వవాప్తమైందని మంత్రి(Minister Talasani) చెప్పారు. అమెరికా, లండన్‌, దుబైలో కూడా మహంకాళి బోనాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అమ్మవారి దర్శనానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారని వెల్లడించారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఈ ఉత్సవాలను జరుపుకొంటామన్నారు. అన్ని శాఖల అధికారులు కలిసి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగేలా కృషిచేస్తున్నారని, వారందరికి అభినందనలు తెలిపారు.

Read Also: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...