మంత్రి రోజా ఎవరో తెలియదు.. కంగనా సెన్సేషనల్ కామెంట్స్

-

రాజకీయ, సినీ ప్రముఖులపై తనదైన శైలిలో విరుచుకుపడే బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి ఏపీ మంత్రి రోజాపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రముఖి-2 మూవీ ప్రమోషన్లలో భాగంగా.. చెన్నైలో మీడియాతో మాట్లాడిన కంగనా.. తాను అసలు సిసలైన దేశ భక్తురాలినని తెలిపారు. అవకాశం వస్తే రాజకీయాల్లోకి వస్తానన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా రాజకీయాల్లోకి వస్తే సినిమాలు వదులుకోవాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ను ఉద్దేశించి రోజా చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కంగనా అసలు రోజా అంటే ఎవరు..? అలాంటి వారు ఉన్నారన్న విషయమే నాకు తెలియదు. ఆమె గురించి నేనేం మాట్లాడతానంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో కంగనా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2005 లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌ గా చంద్రముఖి-2 తెరకెక్కిన సంగతి తెలిసిందే. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ మూవీలో లారెన్స్, కంగనా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ నెల 15న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి M.M.కీరవాణి సంగీతాన్ని అందించగా.. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌ తో ఈ మూవీని నిర్మించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....