ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం

-

అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగాన్ని(Raja Shyamala Yagam) తలపెట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం కొనసాగనుంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆధ్వర్యంలో ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయం క్షేత్రంలో ఈరోజు తెల్లవారుజామున 3 గంటల బ్రహ్మ ముహూర్తంలో యాగం ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు ఈ యాగంలో పాల్గొంటున్నారు.

- Advertisement -

ఈరోజు రాజశ్యామల అమ్మవారు, చండీ అమ్మవార్లతో పాటు ఐదుగురిని ఆవాహనం చేసుకుని హోమం నిర్వహించనున్నారు. రెండో రోజు వేద పారాయణాలు ఉంటాయి. చివరి రోజున పూర్ణాహుతితో యాగం ముగుస్తుంది. ఈ యాగాన్ని(Raja Shyamala Yagam) నిర్వహించిన ప్రతిసారి ఎన్నికల్లో కేసీఆర్(KCR) విజయం సాధిస్తూనే వస్తున్నారు. ఇదే సెంటిమెంటుతో ఇప్పుడు కూడా యాగాన్ని నిర్వహిస్తున్నారు.

Read Also: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. మాజీ ఎంపీ వివేక్ రాజీనామా
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...