కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం

-

హుజురాబాద్‌ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి శవయాత్ర వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. తక్షణమే విచారణ జరిపి నివేదిక అందించాలని స్థానిక ఎన్నికల అధికారిని ఆదేశించింది.

- Advertisement -

చివరి రోజు ప్రచారంలో భాగంగా భార్య, కుమార్తెతో కలిసి కౌశిక్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు వేసి గెలిపిస్తే డిసెంబర్‌ 3న నియోజకవర్గానికి విజయయాత్రగా వస్తా… లేదంటే డిసెంబర్‌ 4న తన శవయాత్రకు ప్రజలు రావాలని వ్యాఖ్యానించారు. తనకు ఇప్పుడు రెండే మార్గాలు ఎమ్మెల్యేగా గెలవడం లేదా తన కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడమో అని ఎమెషన్ బ్లాక్‌మెయిల్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై కౌశిక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో ఈటలను ఎలాగైనా ఓడించాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ప్రభాస్ బర్త్‌డేకు అదిరిపోయే గిఫ్ట్.. రీ రిలీజ్ కానున్న ఏడు సినిమాలు

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) పుట్టినరోజుకు ఎంతో సమయం లేదు. అక్టోబర్ 23న...

సల్మాన్‌ ఖాన్‌ను సఫా చేయడానికి ప్లాన్.. మరొకరు అరెస్ట్..

బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన సల్మాన్ ఖాన్‌(Salman Khan)ను హత్య చేయడం...