Akbaruddin Owaisi | తెలంగాణ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం..

-

తెలంగాణ అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్‌(Pro Tem Speaker)గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi)తో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే కొత్త ఎమ్మెల్యేలతో అక్బరుద్దీన్ ప్రమాణం చేయించనున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణం తర్వాత సాయంత్రం స్పీకర్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. ఆదివారం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఇప్పటికే స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌(Gaddam Prasad Kumar) ఎంపికైన సంగతి తెలిసిందే.

- Advertisement -

Pro tem Speaker Akbaruddin Owaisi | నేటి నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలు నాలుగురోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఎమ్మెల్యేల ప్రమాణం తర్వాత స్పీకర్ ఎన్నిక జరగనుంది. అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. చివరగా గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరగనుంది.

Read Also: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదల..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...