Sudha Murthi | రాజ్యసభకు ఇన్ఫోసిస్ సుధామూర్తి.. ప్రధాని మోదీ ప్రకటన..

-

మహిళా దినోత్సవం రోజున ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మాజీ ఛైర్‌పర్సన్, రచయిత్రి సుధామూర్తి(Sudha Murthi)ని రాజ్యసభకి నామినేట్ చేసినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను రాజ్యసభకు నామినేట్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సుధామూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. విద్యారంగంలోనే కాకుండా సమాజానికీ ఎంతో విలువైన సేవలు అందించారని కొనియాడారు.

- Advertisement -

“రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) సుధామూర్తిని రాజ్యసభకి నామినేట్ చేశారని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. సామాజిక సేవ, దాతృత్వం, విద్యారంగంలో ఆమె చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకం. రాజ్యసభలో ఆమె(Sudha Murthi) ప్రాతినిధ్యం నారీశక్తికి నిదర్శనం. దేశ సమర్థతని, మహిళల శక్తిని పెంచాలన్న మా లక్ష్యానికి ఇదో గొప్ప ఉదాహరణ” అని మోదీ తెలిపారు.

Read Also: ప్రధాని మోదీ ఉమెన్స్ డే కానుక.. వంట గ్యాస్ ధర తగ్గింపు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...