ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు.. మండిపడ్డ టీడీపీ అధిష్టానం..

-

సత్య వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం(MLA Adimoolam)పై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు లేఖ కూడా రాశారు. చెల్లి అంటూనే తనపై పలు మార్లు అత్యాచారానిక పాల్పడినట్లు ఆమె తన లేఖలో పేర్కొన్నారు. తాను టీడీపీ పార్టీకి చెందిన మనిషినే కావడంతో పార్టీ కార్యక్రమాల్లో ఆయన పరిచయం అని, ఆ పరిచయంతోనే ఫోన్ నెంబర్ తీసుకుని వేధించడం మొదలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని బీమాస్ హోటల్ 109వ నెంబర్ రూమ్‌కి రావాలని ఒకరోజు ఫోన్ చేశారని, అక్కడకు వెళ్లిన తర్వాత తనపై లైంగిక దాడులకు పాల్పడ్డారని, ఈ ఘటనను పెన్ కెమెరాలో చిత్రీకరించానని, వాటినే ఇప్పుడు బయటపెడుతున్నానని చెప్పారు.

- Advertisement -

ఈ విషయంపై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆదిమూలం(MLA Adimoolam)పై సస్పెన్షన్ వేటు వేసింది. కేసు ఒక కొలిక్కి వచ్చే వరకు ఆదిమూలంను పర్యవేక్షణలో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా సదరు బాధిత మహిళకు పూర్తి భద్రత కల్పించాలని కూడా ఆదేశించారు.

Read Also: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మరో మాజీ ఎంపీ అరెస్ట్..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...