టీడీపీలో చేరతా.. అభివృద్ధికి కృషి చేస్తా: తీగల కృష్ణారెడ్డి

-

త్వరలోనే టీడీపీలో చేరనున్నానంటూ మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి(Teegala Krishna Reddy) సంచలన ప్రకటన చేశారు. ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబుతో మాజీ మంత్రులు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ మేరకు ప్రకటన చేశారు. త్వరలోనే తాను టీడీపీలో చేరతానని, హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు, టీడీపీనే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ బలోపేతం కోసం కృషి చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అందులో భాగంగానే తెలంగాణలోని బలమైన నాయకులను టీడీపీలోకి ఆహ్వానించే ప్రయత్నంలో చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారని కూడా సమాచారం. ఈరోజు ముగ్గురు మాజీ మంత్రులతో భేటీ కూడా ఆ ప్రయత్నాల్లో భాగమేనన్న వాదన వినిపిస్తోంది.

- Advertisement -

‘‘తెలంగాణలో ఇంకా టీడీపీ అభిమానులు ఉన్నారు. టీడీపీకి తెలంగాణలో మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తాం. త్వరలోనే ఆ పార్టీలో చేరనున్నాను. నాతో పాటు చాలా మంది నాయకులు టీడీపీలో చేరనున్నారు’’ అని ఆయన ప్రకటించారు. కాగా ఈ సందర్బంగానే మీడియాతో మాట్లాడటానికి మాజీ మంత్రులు మల్లారెడ్డి(Malla Reddy), మర్రి రాజశేఖర్‌ రెడ్డి(Marri Rajasekhar Reddy) నిరాకరించారు. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి తన శాయశక్తులా కృషి చేస్తానని, మళ్ళీ టీడీపీని తెలంగాణలో నిలబెడతామని ఆయన(Teegala Krishna Reddy) చెప్పుకొచ్చారు.

Read Also: మేమేం అభివృద్ధికి వ్యతిరేకం కాదు: ఓవైసీ
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘ఆ విజయం మనకు స్ఫూర్తి’.. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలన్న అమిత్ షా

మావోయిస్టు తీవ్రవాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit shah) కీలక...

నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డ్ చేయండి: కోర్డు ఆదేశాలు

తన కుటుంబాన్ని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖా(Konda Surekha) చేసిన వ్యాఖ్యలు...