సీఎం జగన్ ఉరవకొండ పర్యటన.. మంత్రి పెద్దిరెడ్డికి ఊహించని పరిణామం

-

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy)కి షాక్ తగిలింది. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆయనకి ఊహించని పరిణామం ఎదురైంది. ఈ నెల 23 న ఉరవకొండలో సీఎం పర్యటన ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన మంత్రికి నిరసన సెగ తగిలింది. అంగన్వాడీలు ఆయన వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. కాన్వాయ్ ముందుకు కదలకుండా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.

- Advertisement -

మంత్రి కాన్వాయ్ ని అడ్డుకుని వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనల నడుమ దాదాపు అరగంటసేపు ఆయన వాహనం అక్కడే నిలిచిపోయింది. మంత్రి కూడా అంతసేపు వాహనంలోనే ఉండిపోయారు. దీంతో ఆ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు అంగన్వాడీ కార్యకర్తల్ని పక్కకి లాగేశారు. అనంతరం మంత్రి(Peddireddy) కాన్వాయ్ ని ముందుకి పంపించేశారు.

Read Also: కరెంట్ బిల్లులు కటొద్దు.. ప్రజలకు కేటీఆర్ పిలుపు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...