YS Sharmila | హత్యా రాజకీయాలకు ముగింపు పలకాలంటే జగన్‌ను ఓడించాలి

-

హత్యా రాజకీయాలకు ముగింపు పలకాలంటే జగనన్న, అవినాశ్ రెడ్డిని ఓడించాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల(YS Sharmila) ప్రజలకు పిలుపునిచ్చారు. కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో ఆమె బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో వివేకా కుమార్తె సునీతతో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కడప లోక్‌సభ ఎన్నికల్లో ఓ వైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డ.. మరోవైపు వివేకాను హత్య చేయించిన అవినాశ్ రెడ్డి(Avinash Reddy) ఉన్నారని తెలిపారు. హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదనే తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పారు. ధర్మం కోసం ఒకవైపు తాను… డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి మరోవైపు ఉన్నారని… ఎవరిని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.

- Advertisement -

దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో అద్భుత పథకాలను తీసుకొచ్చారని అన్నారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్ మెంట్, రుణమాఫీ వంటి ఎన్నో పథకాలను అమలు చేశారని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్… అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టారని షర్మిల(YS Sharmila) దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉండేవని చెప్పారు. మొత్తానికి కడప జిల్లా రాజకీయాలు వివేకా హత్య అంశం కేంద్రంగానే జరుగుతున్నాయి.

Read Also: తొలి తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ కన్నుమూత
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...