Kuna Srisailam Goud | బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీశైలం గౌడ్..

-

తెలంగాణ ఎన్నికల వేళ వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. తాజాగా బీజేపీ సీనియర్ నేత కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్(Kuna Srisailam Goud) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంత్ రావు పాల్గొన్నారు.

- Advertisement -

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన శ్రీశైలం గౌడ్ రెండో స్థానంలో నిలిచారు. అయితే ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ను ఆశించారు. కానీ ఆ సీటు ఈటల రాజేందర్‌కు దక్కింది. దీంతో అప్పటి నుంచి పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన(Kuna Srisailam Goud) కాంగ్రెస్ నేతల ఆహ్వానం మేరకు హస్తం పార్టీలో చేరారు.

కాగా మల్కాజిగిరి ఎంపీ సీటును కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సిట్టింగ్ సీటు కావడంతో మరోసారి గెలవాలని పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డికి బరిలో ఉన్నారు. ఈ పార్లమెంట్ పరిధిలోకి మేడ్చల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఇతర పార్టీల కీలక నేతలను ఆకర్షిస్తున్నారు.

Read Also: హత్యా రాజకీయాలకు ముగింపు పలకాలంటే జగన్‌ను ఓడించాలి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...