AP Voter List | ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి కీలక ప్రకటన

-

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా(Mukesh Kumar Meena) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా(AP Voter List)ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే దీనిపై ప్రత్యేకంగా ప్రచారం చేశామని వివరించారు. ఓటర్ల జాబితా విషయంలో రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇంటింటికి వెళ్లి పరిశీలిస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 17న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటిస్తామని అన్నారు. అనంతరం అభ్యంతరాల స్వీకరణ ముగిశాక, 2024, ఫిబ్రవరి 5న తుది ఓటర్ల జాబితా(AP Voter List)ను ప్రకటిస్తామని తెలిపారు. రాజకీయ పార్టీలు బీఎల్ఏలను నియమించుకోవచ్చని చెప్పారు. ప్రతి 1,000 మందిలో 714 మంది ఓటర్లు ఉండాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల కొద్దిగా ఎక్కువ ఉందని వివరించారు. ఓటులేని వారు ఇప్పుడు ఓటు నమోదు చేసుకోవచ్చని అన్నారు. ఓటర్ల జాబితా ప్రక్రియను పారదర్శకంగా రూపొందిస్తామని చెప్పారు. ఏపీలో యువ ఓటర్లు చాలా తక్కువ ఉన్నారని తెలిపారు.

- Advertisement -
Read Also:
1. ఏపీలో ప్రజలు స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదు: చంద్రబాబు
2. హాస్టల్ విద్యార్థినిపై వైసీపీ కార్యకర్త అత్యాచారం?

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...