Gidugu Rudra Raju | రామ్ గోపాల్ వర్మకు ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వార్నింగ్

-

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(RGV) తెరకెక్కిస్తున్న వ్యూహం(Vyooham) సినిమా టీజర్ ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఈ సినిమాను సీఎం జగన్ రాజకీయ జీవితం ఆధారంగా తీస్తున్నారు. టీజర్‌లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చనిపోయినప్పటి నుంచి ఇప్పుడు సీఎం అయ్యే వరకు జగన్ ప్రయాణం ఎలా సాగింది అనే కోణంలో టీజర్‌ను వదిలారు ఆర్జీవీ. టీజర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా… కేవలం సీన్లను మాత్రమే చూపించాడు. జగన్‌పై సీబీఐ కేసులు, చంద్రబాబు కుట్రలు ఇలా అన్నింటినీ టచ్ చేశాడు. ఈ టీజర్‌పై ఏపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా.. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు(Gidugu Rudra Raju) స్పందించారు. రాంగోపాల్ వర్మ సినిమాలో సోనియాగాంధీని చెడుగా చూపిస్తే ఊరుకునేదిలేదని వార్నింగ్ ఇచ్చారు. అసలు వాస్తవాలు వర్మకి తెలుసా అని ప్రశ్నించారు. ఖబడ్దార్ రాంగోపార్ వర్మ అని ‍హెచ్చరించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు, సిద్దాంతాలకు కట్టుబడి ఎవరూ వచ్చిన స్వాగతిస్తామని ఆయన(Gidugu Rudra Raju) తెలిపారు.

- Advertisement -
Read Also:
1. ఏపీ రాజకీయాలపై నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు
2. పవన్‌ కల్యాణ్ మలికిపురం సభలో ఆసక్తికర సీన్‌

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Chandrababu | వంగవీటి రాధాపై చంద్రబాబు ప్రశంసలు

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రశంసలు కురిపించారు....

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

త్వరలో అమెరికా, వెస్టిండీస్‌ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం భారత...