Avinash Reddy |హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాశ్ రెడ్డి

-

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి(Avinash Reddy)కి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టణంలోని సీఎం జగన్(CM Jagan) క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించడానికి ఆయన పులివెందుల బయలుదేరారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోవైపు అవినాశ్ మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందలేదని అవినాశ్(Avinash Reddy) తరపు లాయర్ తెలపడంతో న్యాయస్థానం మధ్యాహ్నం 2.30గంటలకు విచారణను వాయిదావేసింది. మరి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది.

- Advertisement -
Read Also: రాయల తెలంగాణ డిమాండ్‌ను ఖండిస్తున్నా: బైరెడ్డి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...

ఏపీ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు

ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌...