రాయల తెలంగాణ డిమాండ్‌ను ఖండిస్తున్నా: బైరెడ్డి

-

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి(Byreddy Rajasekhar Reddy) అసహనం వ్యక్తం చేశారు. రాయలసీమపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. రాయలసీమ అభివృద్ధిపై కేంద్రానికి, ప్రధాని మోడీకి ఎన్నో లేఖలు రాశామన్నారు. అయినా పట్టించుకోలేదన్నారు. కర్ణాటక(Karnataka) తరహాలో రాయలసీమను అభివృద్ధి చేయాలని తెలిపినా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా రాయలసీమకు తీవ్ర అన్యాయాన్ని చేస్తున్నాయని మండిపడ్డారు. అనంతరం, సీనియర్ రాజకీయ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి(JC Diwakar Reddy) లేవనెత్తిన రాయల తెలంగాణ డిమాండ్‌ను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. రాయలసీమను విడదీయడం ఎవరి తరం కాదని అన్నారు. రాయలసీమలో పుట్టడం ఒక వరమని, ఎన్ని జన్మలెత్తినా సీమలోనే పుట్టాలని కోరుకుంటానని బైరెడ్డి(Byreddy Rajasekhar Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -
Read Also: యూపీ సీఎం యోగిని చంపేస్తామని వార్నింగ్ కాల్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...