సీబీఐకు ఎంపీ అవినాశ్ రెడ్డి మరో లేఖ

-

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి(Avinash Reddy) మరోసారి సీబీఐకు లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రి ఉందని, ప్రస్తుతం తాను తల్లికి అండగా నిలబడాల్సి ఉందని లేఖలో ప్రస్తావించారు. ఈ పరిణామాల నేపథ్యంతో విచారణకు మరికొంత సమయం కావాలని ఈనెల 27 వరకు విచారణకు గడువు ఇవ్వాలని సీబీఐను కోరారు. ఈనెల 27 తర్వాత ఏ రోజు అయినా విచారణకు హాజరవుతానని తెలిపారు. అంతేకాదు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్(Anticipatory Bail) పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుందని లేఖలో ప్రస్తావించారు. అయితే ఈ లేఖపై సీబీఐ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాదులు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్‌ కోసం ఎంపీ అవినాశ్ రెడ్డి(Avinash Reddy) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించేందుకు వెకేషన్ బెంచ్ నిరాకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. 30వ స్థానంలో హైదరాబాద్..

తెలంగాణ పదో తరగతి ఫలితాలు(TS SSC Results) విడుదలయ్యాయి. బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ...

Janasena | జనసేనకు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై ఈసీ కీలక ఆదేశాలు..

ఎన్నికల వేళ జనసేన(Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది....