గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల తేదీలు ఖరారు

-

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్-1 మెయిన్స్‌(AP Group 1 Mains) పరీక్ష తేదీలు వెల్లడించింది. జూన్‌ 3 నుంచి 10వ తేదీ వరకు మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయని పేర్కొంది. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం.. ఏప్రిల్‌ 23 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉండగా.. యూపీఎస్సీ సివిల్స్‌ ఇంటర్వ్యూ షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్ మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. కొత్త తేదీల ప్రకారం మెయిన్స్‌ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పది జిల్లాల్లోని ప్రధాన పరీక్ష కేంద్రాల్లో జరుగనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ హాల్‌టికెట్లు మే 24 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...