Janasena: జనసేన కార్యకర్తలు అరెస్టు

-

Janasena: పవన్‌ కల్యాణ్‌ విశాఖ పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. శనివారం విశాఖ గర్జనకు నాన్‌ పొలిటికల్‌ జేఏసీ కార్యక్రమానికి వైసీపీ మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి ప్రారంభమైన విశాఖ గర్జనలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్తున్న వైసీపీ మంత్రుల కార్లపై, ఎయిర్‌పోర్ట్‌ వద్ద జనసేన నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో పలువురు జనసేన కార్యకర్తల్ని అరెస్టు చేసినట్లు విశాఖ సీపీ ప్రకటించారు. అంతేగాకుండా, పవన్‌(Pawan Kalyan) బస చేస్తున్న నోవాటెల్‌ వద్ద ఉన్న పలువురు జనసేన (Janasena) కార్యకర్తలను సైతం పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

మంత్రి రోజాను, వైసీపీ నేతలను అగౌరవపరిచే విధంగా జనసేన కార్యకర్తలు వ్యవహరించారని సీపీ వెల్లడించారు. వారిపై దాడి చేసి చంపాలని చూశారని, ప్రజాశాంతికి భంగం వాటిల్లిందని సీపీ ప్రకటించారు. ఎయిర్‌పోర్టులో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులతో పాటు, సామాన్య ప్రజలకు గాయాలయ్యాయని సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జనసేన (Janasena) కార్యకర్తలపై కేసులు నమోదు చేసి, అరెస్టులు చేసినట్లు విశాఖ సీపీ వివరించారు.

Read Also: ముందస్తు ప్లాన్‌తోనే మాపై దాడులు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...