వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడు ఉదయ్ అరెస్ట్

-

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ కు తీసుకువెళ్లి విచారణ చేశారు. అతని నుంచి కీలక సమాచారం రాబట్టిన అధికారులు సీబీఐ కోర్టులో హాజరుపరిచేందుకు హైదరాబాద్ తీసుకువస్తున్నారు.

- Advertisement -

వివేకా హత్య(Viveka Murder Case) జరిగిన రోజు అవినాశ్ రెడ్డి(YS Avinash Reddy), శివశంకర రెడ్డితో పాటు ఉదయ్ కుమార్ కూడా ఘటనా స్థలంలోనే ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. వివేకానందరెడ్డి మృతదేహానికి ఉదయ్ తండ్రి జయప్రకాశ్ రెడ్డినే బ్యాండేజ్ కట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు నేపథ్యంలో ఉదయ్ ని ఇప్పటికే పలుమార్లు విచారించిన సీబీఐ ఇప్పడు అదుపులోకి తీసుకుంది. కాగా వివేకా హత్య కేసు దర్యాప్తును ఈనెల 30లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించండంతో అధికారులు దూకుడు పెంచారు.

Read Also: కేసీఆర్ చేతుల మీదుగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ.. విశేషాలు ఇవే

Follow us on: Google News, Koo, Twitter

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...