Viveka Murder Case | వివేకా హత్య కేసు నిందితుల రిమాండ్ పొడిగింపు

-

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో నిందితుల రిమాండ్‌ను సీబీఐ కోర్టు పొడిగించింది. నిందితులు వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ రెడ్డిల రిమాండ్‌ను ఈనెల 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న ఆరుగురు నిందితులను అధికారులు సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా ఆరుగురి నిందితులకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. అనంతరం జూన్ 30వ తేదీకి విచారణను వాయిదా వేశారు. కాగా జైలులో ఉన్న భాస్కరరెడ్డిని ఆయన తనయుడు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి గురువారం ములాఖత్‌లో భాగంగా పరామర్శించారు.

- Advertisement -
Read Also:
1. ‘2019లో జగన్‌ను గెలిపించటం ప్రజలు చేసిన తప్పే’
2. దేశానికి రెండో రాజధానిగా తెలంగాణ

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల'...

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...