Chandrababu | జగన్ ఓటమి ఖాయం.. కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం

-

ఈ ఎన్నికల్లో వచ్చేది కురుక్షేత్ర యుద్ధమని.. ఈ యుద్ధానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు. పీలేరులో నిర్వహించిన ‘రా కదలిరా’ సభల్లో పాల్గొన్న చంద్రబాబు సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వైనాట్ 175 అంటున్న జగన్‌కు కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని సెటైర్లు వేశారు. నాడు అదే బడ్జెట్.. నేడు అదే బడ్జెట్.. మరి పన్నులు ఎందుకు వేశావ్.. అప్పులు ఎందుకు చేశావ్ అని జగన్‌ను నిలదీశారు.

- Advertisement -

రాయలసీమలో జగన్ చేసిన అభివృద్ది ఏంటి? ఒక్క ప్రాజెక్టు కట్టారా..? ఒక్క పరిశ్రమ తెచ్చారా..? అని నిలదీశారు. తాను రాయలసీమ బిడ్డనే తనలో ప్రవహించేది కూడా సీమ రక్తమేనన్నారు. తన పాలనలో రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ. 12,500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు శ్రీశైలం ద్వారా 120 టీఎంసీలు ఇచ్చామని గుర్తు చేశారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వం వచ్చి రాయలసీమను రతనాల సీమగా మార్చే బంగారు అవకాశాన్ని చెడగొట్టిందని మండిపడ్డారు. జగన్ పాలనలో ప్రజలందరూ తీవ్ర అవస్థలు పడుతున్నారని.. ఎప్పుడెప్పుడూ జగన్‌(Jagan)ను దించేద్దామా అని ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. వచ్చేది టీడీపీ(TDP)-జనసేన(Janasena) ప్రభుత్వమేనని.. అధికారంలోకి రాగానే అవినీతిపరుల అంతు చూస్తా అని చంద్రబాబు(Chandrababu) హెచ్చరించారు.

Read Also: అభిమన్యుడిని కాదు అర్జునుడిని.. ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...