శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు.. షెడ్యూల్ విడుదల.. 

-

టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. రేపు(గురువారం) మధ్యాహ్నం 2.25 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి 3.50 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5 గంటలకు తిరుమల చేరుకుంటారు. రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. డిసెంబరు 1(శుక్రవారం) ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు.

- Advertisement -

దర్శనం అనంతరం 11.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని 12.40 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. రోడ్డుమార్గంలో మధ్యాహ్నం 1.30 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి, సింహాద్రి అప్పన్న స్వామి వార్లను కూడా చంద్రబాబు దర్శించుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...