వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

YCP MLAs Suspension

YCP MLAs Suspension |ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అధికార వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. గురువారం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. అంతకముందు క్రాస్ ఓటింగ్‌పై అంతర్గత విచారణ జరిపిన వైసీపీ.. ఆనం రామనారాయణరెడ్డి, మేకపటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని సస్పెండ్ చేసింది. ఈ నలుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే అభియోగంతో వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ నుంచి శుక్రవారం సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Read Also: రాహుల్ కంటే ముందు అనర్హత వేటుపడిన పొలిటీషియన్స్ వీళ్లే..!

Follow us on: Google News  Koo Twitter

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here