Jagan | అభిమన్యుడిని కాదు అర్జునుడిని.. ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధం

-

సీఎం జగన్(CM Jagan) ఎన్నికల శంఖారావం పూరించారు. విశాఖ జిల్లా భీమిలి(Bheemili)లో ఏర్పాటు చేసిన ‘సిద్ధం’ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతిపక్షాల పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి తాను అభిమన్యుడు కాదని అర్జునుడిని అని తెలిపారు. ఓవైపు పాండవ సైన్యం .. మరోవైపు కౌరవ సైన్యం ఉందని.. కృష్ణుడి లాంటి ప్రజలు, కార్యకర్తలు తనకు అండగా ఉన్నారని ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందేనని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని.. అందుకే దత్తపుత్రుడితో పాటు ఇతరులతో పొత్తుకు వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

- Advertisement -

175 సీట్లలోనూ మనమే గెలుస్తు్న్నామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో మరో పాతికేళ్లు మన జైత్రయాత్ర కొనసాగాలని పిలుపునిచ్చారు. ఈ యుద్ధం అబద్ధానికి, నిజానికి మధ్య.. మోసానికి, నిజాయితీకి మధ్య జరుగుతుందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 99శాతం హామీలను నెరవేర్చామని.. ఈ ఐదేళ్లలో మనం చేసిన మంచిని ప్రజలకు వివరించాలని సూచించారు. విద్య, వైద్యం, పాలనా రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని.. ఈ మార్పులు ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకూ కనిపిస్తు్న్నాయని జగన్(Jagan) వెల్లడించారు.

Read Also: YSR పార్టీ అంటే వైవీ.. సాయిరెడ్డి.. రామకృష్ణారెడ్డి.. షర్మిల సెటైర్లు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...