అధికార వైసీపీకి మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే..

-

ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు(Kondeti Chittibabu) ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ముద్దనూరులో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఈ ఎన్నికల్లో పి.గన్నవరం టిక్కెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టిబాబును కాదని విప్పర్తి వేణుగోపాల్‌కు సీఎం జగన్ కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నఆయన పార్టీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పి.గన్నవరం నుంచి ఆయన పోటీచేసే అవకాశం ఉంది.

- Advertisement -

చిట్టిబాబు పార్టీలో చేరిన సందర్భంగా ఆయనకు షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. “కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని నమ్ముతూ అధికార వైసీపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభపరిణామం. ఈ క్రమంలోనే పి.గన్నవరం MLA , వైసీపీ సీనియర్ నాయకులు కొండేటి చిట్టిబాబు(Kondeti Chittibabu) ఈరోజు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.” అని షర్మిల ట్వీట్ చేశారు.

Read Also: తండ్రి అయిన మంచు మనోజ్.. పండంటి పాపకు జన్మనిచ్చిన మౌనిక..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...