MP Rammohan Naidu: మాయ మాటలతో జగన్ అధికారంలోకి.. ఎంపీ రామ్మోహన్‌

-

MP Rammohan Naidu fires on cm jagan: విభజన హామీలు కూడా సాధించలేని సీఎం జగన్ మూడు రాజధానులు ఏం నిర్మిస్తాడని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అపహాస్యం చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి” అనే కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు మూడు రాజధానులు అనే అంశాన్ని.. తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ప్రజలను ఉద్యోగులను తన మాయ మాటలతో మాయ చేసీ జగన్ అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. టీడీపీ చేపట్టిన “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’’ విజయవంతమవుతోందన్నారు. వైసీపీ నాయకులు ముందస్తు ఎన్నికల కోసం మాట్లాడుతున్నారంటే వైసీపీలో భయం మొదలైందని.. ఎన్నికలు రేపు వచ్చిన చంద్రబాబును గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన జగన్‌‌‌ రెడ్డి ఓటమి ఖాయం అని ధీమావ్యక్తం చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఫోన్ ట్యాపింగ్.. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తోంది?

తెలంగాణలో ఫోన్ టాపింగ్(Phone Tapping) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ.. సరికొత్త...

నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష ఉమ్మడి...