MLA Arthur | కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

-

ఎన్నికల వేళ అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్థర్(MLA Arthur) కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్‌ వైయస్ షర్మిల(YS Sharmila) ఆయను కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో నందికొట్కూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్థర్ పోటీ చేయనున్నట్లు సమాచారం.

- Advertisement -

ఈ సందర్భంగా షర్మిల ట్వీట్ చేస్తూ “కాంగ్రెస్ పార్టీ తరఫున నందికొట్కూరు ఎమ్మెల్యే శ్రీ ఆర్థర్ గారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నందుకు ఆనందిస్తున్నాను, అయన అనుభవం, ప్రజాసేవ చేయాలనే తపన, కాంగ్రెస్ పార్టీకి కొత్త బలాన్ని అందిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చేరిక, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ, నమ్మకం, కొత్త రెక్కలతో, మరింత శక్తితో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పుంజుకుంటోంది అనే నిజాన్ని నిరూపిస్తోంది.” అని తెలిపారు.

కాగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్థర్‌(MLA Arthur)కు సీఎం జగన్ ఈసారి టికెట్ నిరాకరించడంతో ఆయన అలకబూనారు. ఈసారి ఎలాగైనా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ముందుగా టీడీపీలో చేరాలని భావించారు. అయితే అప్పటికే అక్కడ తెలుగుదేశం అభ్యర్థి ఖాయం కావడంతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. చివరకు షర్మిల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో హస్తం కండువా కప్పుకున్నారు.

Read Also:  మహేష్‌బాబు చాలా అందగాడు.. జపాన్‌లో రాజమౌళి వ్యాఖ్యలు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...

Malla Reddy | మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)...