Narendra modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబరు 11న విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. రూ. 400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అదే రోజు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారని.. అనంతరం నగరంలో జరగనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగిచనుండగా.. ఇందుకోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని (Narendra modi)పర్యటనలో సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ ప్రధాని పర్యటనలో పాల్గొనున్నారు. ప్రధాని పర్యటన మేరకు చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున, జేసీ విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు ప్రాథమికంగా చర్చించినట్లు తెలుస్తుంది.
Read also: కేటీఆర్ చేతుల మీదుగా నాగోల్ ఫ్లై ఓవర్ ప్రారంభం