ఆ ఎమ్మెల్యేపై సీఎం జగన్ మౌనమెందుకు? : ఎమ్మెల్సీ అనురాధ

-

టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ(Panchumarthy Anuradha), ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ(Adireddy Bhavani) ని పరామర్శించారు. ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కొడుకు శ్రీనివాస్ లను జగన్ ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి కారణంగానే వారిని అరెస్ట్ చేయించారని ఆరోపించారు. వైసీపీ కి ఓటు వేయలేదని కారణంగా కక్ష్యసాధింపు చర్యలో భాగంగానే.. వారి కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గపు చర్య అంటూ మండిపడ్డారు.  జగన్ బెదిరింపులకు భయపడే టీడీపీ నాయకులు ఎవరు లేరని అన్నారు. భవానీ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని ఆమె తెలిపారు. బీసీ లు టీడీపీ కి దగ్గర అవుతున్నారనే భయంతోనే బీసీ నాయకులను జైల్లో పెడుతున్నారని ఎమ్మెల్సీ అనురాధ ఆరోపణలు చేసారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహిస్తున్న చిట్ ఫండ్ కంపెనీ లపై సీఐడీ అధికారులు ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు.  సీఎం జగన్ కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చేసే భూ కబ్జాల పై మౌనంగా ఎందుకు ఉంటున్నారని ఎమ్మెల్సీ అనురాధ(Panchumarthy Anuradha) అడిగారు.

- Advertisement -
Read Also: జగన్ బుజ్జగించినా మెత్తబడని బాలినేని.. అందుకే రాజీనామా చేశానని వివరణ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...