బిగ్ బ్రేకింగ్: టీడీపీతో పొత్తుపై జనసేనాని క్లారిటీ

-

స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ఆయనను .తనయుడు నారా లోకేష్(Nara Lokesh), బావమరిది బాలకృష్ణ(Balakrishna), జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో ములాఖత్ సమయంలో భేటీ అయ్యారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరి భేటీలో పొలిటికల్ అజెండా ఉందని అందరూ భావించారు. పొత్తులపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు వినిపించాయి. అందరూ భావించినట్టే భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి తో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -

వైసీపీని ఎదుర్కొనేందుకు టిడిపి తో కలిసి ఎన్నికల్లోకి వెళ్తానని తేల్చి చెప్పారు. వైసిపి మరోసారి గెలిస్తే రాష్ట్రంలో కోలుకోదని, అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ఓడించాలని తాను నిర్ణయించుకున్నట్టు చెప్పారు. దీనికోసం టిడిపి తో కలిసి అడుగులు వేసేందుకు తాను సిద్ధమైనట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం బిజెపితో ఉన్న జనసేనాని(Pawan Kalyan) టిడిపి తో పొత్తు గురించి కమలం పెద్దలకు వివరిస్తానని తెలిపారు. బిజెపి మద్దతు సంపూర్ణంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

Read Also: నిఫా వైరస్ కలకలం.. కేంద్ర ప్రభుత్వం అలర్ట్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...