ఇక రాజకీయాలకు సెలవు.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

-

మచిలీపట్నం(Machilipatnam) ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్నినాని(Perni Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నంలో సీఎం జగన్ బందర్ పోర్టు ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పేర్ని మాట్లాడుతూ మరోసారి జగన్ తో వేదిక పంచుకునే అవకాశం వస్తుందో రాదో అని తెలిపారు. బహుశా ఆయనతో ఇదే నా చివరి మీటింగ్ కావచ్చు అని వ్యాఖ్యానించారు. వేదికపై చాలా సేపు మాట్లాడిన ఆయనను మిగతా నేతలు సమయం లేదు ప్రసంగం ఆపాలని విజ్ఞప్తి చేసినా పేర్ని(Perni Nani) పట్టించుకోలేదు. తనకు జగన్(Jagan) తో ఇదే చివరి మీటింగ్ కావచ్చని, ప్రసంగం ఆపనని పేర్కొన్నారు. వయస్సులో జగన్ చిన్నవాడు అయిపోయారు.. లేదంటే పాదాభివందనం చేసే వాడినని తెలిపారు. తన కుమారుడు రాజకీయ భవిష్యత్ కోసమే ఆయన రిటైర్మెంట్ ప్రకటించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -
Read Also: బిగ్ బ్రేకింగ్: సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల'...

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...