ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీజేఐకి పురందేశ్వరి లేఖ

-

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Purandeswari) లేఖ రాశారు. పదేళ్లుగా బెయిల్‌పై కొనసాగుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని.. సీబీఐ, ఈడీ కేసుల విషయంలో షరతులు ఉల్లంఘిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆయనపై ఇప్పటికే 11 అభియోగాలు, పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నాయని తెలిపారు. విజయసాయి రెడ్డితో పాటు సీఎం జగన్ పది సంవత్సరాలకు పైగా బెయిల్‌పై ఉన్నారని.. ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా వాయిదాలతో అడ్డుకుంటున్నారని ఫిర్యాదుచేశారు.

- Advertisement -

విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న సమయంలో కడప గూండాలతో విశాఖలో భూ ఆక్రమణలకు పాల్పడ్డారన్నారు. మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో ఆయన గుండెపోటుతో మరణించారని ప్రజలను తప్పుదోవ పట్టించారని పేర్కొ్న్నారు. ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారన్నారు. తక్షణమే జగన్, విజయసాయి బెయిల్ రద్దు చేయాలని సీజేఐని విజ్ఞప్తి చేశారు.

కాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలి పదవి చేపట్టిన దగ్గరి నుంచి పురందేశ్వరి(Purandeswari) వైసీపీ ప్రభుత్వం అవినీతిపై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మద్యం సరఫరా కంపెనీల వెనక ఎంపీ విజయసాయి రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. పురందేశ్వరి ఆరోపణలపై వైసీపీ నేతలు కూడా ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఆమె టీడీపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. దీంతో పురందేశ్వరి వర్సెస్ వైసీపీగా పరిస్థితి మారింపోయింది.

Read Also: తెలంగాణలో మూడు రోజలు వైన్స్ బంద్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala | తిరుమలలో భారీ వర్షం.. సేదతీరిన భక్తులు..

తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం...

Dande Vital | బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...