కొత్త జంటతో పాటు హైదరాబాద్‌ చేరుకున్న మెగా ఫ్యామిలీ

-

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి(Varun Tej Lavanya Tripathi)ల విహహం నవంబర్ 1న ఇటలీలోని(Italy) టస్కనీలో హిందూ సాంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జ‌రిగింది. ఇక ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే బయటకి వచ్చి బాగా వైరల్ అయ్యాయి. పెళ్లికి వారం రోజుల ముందే ఫ్యామిలీ అంతా ఇటలీ వెళ్లి నాలుగు రోజుల పాటు సందడి చేశారు. అక్కడ పెళ్లి తంతు ముగియడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కొత్త జంట వరుణ్, లావణ్యలకు ఘనస్వాగతం పలుకుతూ అభిమానులు పూలవర్షం కురిపించారు.

- Advertisement -

Varun Tej Lavanya Tripathi | వీరితో పాటు మెగాస్టార్ చిరంజీవి దంపతులు, నాగబాబు దంపతులు, రామ్ చరణ్ కపుల్, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. వీళ్లందరికన్నా ఒకరోజు ముందుగానే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), అల్లు అర్జున్ (Allu Arjun) కూడా వచ్చేశారు. ఎయిర్ పోర్టులో మెగా కుటుంబ సభ్యులు వచ్చిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక త్వరలోనే సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఇక్కడ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

Read Also: మూడుముళ్ల బంధానికి ఈ ‘ మూడు’ ఎంతో అవసరం!!
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...