చంద్రబాబును పరామర్శించిన పవన్ కల్యాణ్‌..

-

Pawan Kalyan – Chandrababu |టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పరామర్శించారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్.. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలసుకున్నారు. త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. పొత్తు ప్రకటన తర్వాత చంద్రబాబును పవన్ కల్యాణ్ కలవడం ఇదే మొదటి సారి. ఈ సమావేశంలో ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా చంద్రబాబు బెయిల్‌పై విడుదలైన సమయంలో వరుణ్ తేజ్ పెళ్లి కార్యక్రమం కోసం పవన్(Pawan Kalyan) ఇటలీలో ఉన్నారు. సోషల్ మీడియాలో చంద్రబాబు విడుదలపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -

అక్టోబర్ 31న రాజమండ్రి జైలు నుంచి విడుదలైన చంద్రబాబు గురువారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యుల సూచనల మేరకు ఒకరోజు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇవాళ ఎల్వీప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. మరో రెండు రోజుల్లో కంటికి సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకుంటారని తెలుస్తోంది.

Read Also: కొత్త జంటతో పాటు హైదరాబాద్‌ చేరుకున్న మెగా ఫ్యామిలీ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...