ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు నామినేషన్

-

ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishnam Raju) నామినేషన్ దాఖలు చేశారు. ఉండి ఎమ్మార్వో ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు. తొలుత ఉండి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు చంద్రబాబు కేటాయించారు. అయితే పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ టికెట్ శ్రీనివాస్ వర్మకు బీజేపీ ఇచ్చింది. దీంతో అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేద్దామని భావించిన రఘురామకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరడంతో ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు.

- Advertisement -

ఇవాళ ఉదయం 10 గంటలకు పెదఅమిరం గ్రామంలోని తన నివాసం నుంచి రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishnam Raju) భారీ ర్యాలీగా ఎమ్మార్వో ఆఫీసుకు చేరుకున్నారు. ఈ ర్యాలీలో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కోలాహలం నెలకొంది. మెడలో టీడీపీ కండువా, తలకు ఎర్రగుడ్డ, కళ్లకు సన్ గ్లాసులు ధరించి రఘురామ ర్యాలీలో ఉత్సాహంగా కనిపించారు.

Read Also: మందుబాబులకు షాక్.. మద్యం షాపులు బంద్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...