ప్రజల దృష్టిని మరల్చడానికి వేసిన ప్లానే ఇది: టీడీపీ ఎంపీ

-

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షలో భాగంగానే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు(Adireddy Apparao)తో పాటు ఆయన తనయుడు, ఆదిరెడ్డి శ్రీనివాస్‌‌లను ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసిందని ఆరోపించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్‌ను మంగళవారం రామ్మోహన్ నాయుడు పరామర్శించారు. త్వరలో జరగబోయే మహనాడు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు తప్పుడు కేసులతో అలజడి సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మెడకు వివేకా హత్య కేసు(Viveka Murder Case) చుట్టుకుంటోంది. రాష్ట్ర ప్రజలు అంతా వాస్తవాలను తెలుసుకుంటున్నారు.. ఈ సమయంలో ప్రజల దృష్టిని మరల్చడానికి వేసిన ప్లాన్‌లో భాగమే అంటూ రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) కీలక వ్యాఖ్యలు చేశాడు. జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాలను అణగదొక్కి పెత్తనం చెలాయించే దిశగా అడుగులు వేస్తోందని అన్నారు.

- Advertisement -
Read Also: మహిళల మానసిక ఒత్తిడి తగ్గించే 3 సులువైన చిట్కాలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...