పాడేరులో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం జగన్ దిగ్భ్రాంతి

-

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు(Paderu Ghat) వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చోడవరం నుంచి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పాడేరు ఘాట్ రోడ్డులో వ్యూ పాయింట్ వద్ద రోడ్డుపై పడి ఉన్న చెట్టును తప్పించబోయి లోయలో పడింది.

- Advertisement -

Paderu Ghat | ప్రమాదం సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 100 అడుగుల లోయలో బస్సు పడిపోయిందని ప్రయాణికులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: ‘విజన్ 2047 అనేది చంద్రబాబు సొంత బ్రాండింగ్ కాదు’
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ప్రభాస్ బర్త్‌డేకు అదిరిపోయే గిఫ్ట్.. రీ రిలీజ్ కానున్న ఏడు సినిమాలు

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) పుట్టినరోజుకు ఎంతో సమయం లేదు. అక్టోబర్ 23న...

సల్మాన్‌ ఖాన్‌ను సఫా చేయడానికి ప్లాన్.. మరొకరు అరెస్ట్..

బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన సల్మాన్ ఖాన్‌(Salman Khan)ను హత్య చేయడం...