TDP Bus Tour | టీడీపీ బస్సుయాత్రలో తీవ్ర విషాదం

-

తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బస్సు యాత్ర(TDP Bus Tour)లో విషాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం పిడుగు రాళ్ల మండలంలో బుధవారం ఈ బస్సు యాత్ర జరిగింది. అయితే, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బ్రాహ్మణపల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభ అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ భోజనాల సమయంలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ తోపులాటలో వేడి కుర్మా డేక్షలో యారగని కోటేశ్వరరావు (55) అనే టీడీపీ కార్యకర్త పడిపోయాడు. దీంతో కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో టీడీపీ కార్యకర్త కోటేశ్వరరావును వెంటనే పిడుగురాళ్ల ప్రైవేట్‌ హాస్పిటల్‌కి తరలించారు. కోటేశ్వరరావు శరీరం 70% కాలిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కోటేశ్వరావుని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోటేశ్వరరావు ప్రాణాలు కోల్పోయాడు.

- Advertisement -
Read Also:
1. అమరావతి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...