అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌కు షాక్.. నోటీసులు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

-

తెలంగాణ హైకోర్టులో ఏపీ సీఎం జగన్‌(YS Jagan)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆయన పిటిషన్‌ను పిల్‌(ప్రజా ప్రయోజన వ్యాజ్యం)గా స్వీకరించేందుకు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. ఈ అభ్యంతరాలపై విచారణ జరిపిన జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రావణ్ కుమార్ ధర్మాసనం పిటిషన్‌ను పిల్‌గా మార్చేందుకు అంగీకరించింది. పిల్‌కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అనంతరం జగన్‌, సీబీఐ, సీబీఐ కోర్టుకు నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

కాగా జగన్‌(YS Jagan) అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలంటూ హరిరామజోగయ్య పిల్‌ దాఖలు చేశారు. 2024లో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోపు కేసులను తేల్చేలా ఆదేశాలివ్వాలని ఈ పిటిషన్‌లో కోరారు. ఇటీవల జగన్ అక్రమాస్తుల కేసులో ఎంపీ రఘురామకృష్ణం రాజు(Raghu Rama Krishna Raju) దాఖలు చేసిన పిటషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Read Also: విజయశాంతిని పక్కనబెట్టిన బీజేపీ.. ప్రముఖుల జాబితాలో లేని చోటు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల'...

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...