ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్న PK వీడియో

-

ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు. హైదరాబాద్ నుంచి ఒకే విమానంలో లోకేష్, ప్రశాంత్ కిషోర్ వచ్చారు. అనంతరం ఇద్దరు కలిసి ఒకే వాహనంలో ఉండవల్లికి వెళ్లారు. ఈ పరిణామం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ టీడీపీతో టచ్‌లోకి వెళ్లడం వైసీపీ శ్రేణులను షాక్‌కు గురిచేసింది.

- Advertisement -

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ(Robin Sharma) రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. ఆయన కూడా గతంలో ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ టీంలో పనిచేశారు. తర్వాత సొంత సంస్థ పెట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబుతో భేటీలో పీకేతో పాటు రాబిన్‌ కూడా పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) వచ్చే ఎన్నికల్లో టీడీపీ కోసం పని చేస్తారా.. సలహాలిస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.

Read Also: అభ్యర్థుల ఎంపికపై జనసేన కీలక స్టెప్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల'...

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...