భాస్కర్​రెడ్డికి వైద్య పరీక్షలు.. అనంతరం జడ్జి ఎదుట హాజరు

-

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(YS Viveka Murder Case)లో అరెస్టు చేసిన భాస్కర్​రెడ్డి(YS Bhaskar Reddy)ని సీబీఐ అధికారులు ఆదివారం మధ్యాహ్నం వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షలు చేస్తుండగా ఒక్కసారిగా భాస్కర్​రెడ్డి బీపీ లెవెల్స్​పెరిగిపోయాయి. దాంతో వైద్యులు ఆయనకు చికిత్స చేసి బ్లడ్​ప్రెషర్‌ను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ఈసీజీ, 2డీ ఈకో పరీక్షలు జరిపారు. తన ఆరోగ్యం బాగానే ఉందని ఈ సందర్భంగా భాస్కర్​రెడ్డి(YS Bhaskar Reddy) వైద్యులతో అన్నట్టు సమాచారం. పరీక్షల అనంతరం సీబీఐ అధికారులు భాస్కర్​రెడ్డిని శాంతినగర్ ​జడ్జెస్ ​క్వార్టర్స్​లోని సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు జడ్జి నివాసంలో ఆయన ఎదుట హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం జడ్జి భాస్కర్​రెడ్డికి పది రోజుల కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో సీబీఐ అధికారులు అతన్ని చెంచల్​గూడ జైలు(Chanchalguda Jail)కు తరలించారు. కాగా, భాస్కర్​రెడ్డి తరఫు న్యాయవాది నాగార్జున రెడ్డి తన క్లయింట్‌కు బెయిల్​మంజూరు చేయాలంటూ పిటీషన్​దాఖలు చేశారు.

- Advertisement -
Read Also: పెళ్లిమీద నమ్మకం లేదు.. డేటింగ్‌తోనే కంటిన్యూ అవుతా: శృతి హాసన్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జగన్ మనోవేదన మీకు గుర్తుకు రాలేదా? సౌభాగ్యమ్మకు అవినాశ్ తల్లి కౌంటర్

ఏపీలో ఎన్నికల వేళ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులు తీవ్ర...

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...