YS Sharmila | ఇన్నాళ్లూ ఏం అడొచ్చింది.. సీఎం జగన్‌పై షర్మిల సెటైర్లు..

-

‘విజన్ విశాఖ’ పేరుతో సీఎం జగన్‌ (YS Jagan) చేసిన ప్రకటనపై ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల (YS Sharmila) తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పరిపాలనా రాజధానిలో ఇన్నాళ్లూ పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు పదేళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలకు తెరదీశారంటూ మండిపడ్డారు.

- Advertisement -

“పరిపాలనా రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్‌మెంట్‌. ఐటీ హిల్స్‌ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా.. చూస్తూ ఉండటం మీ రోడ్‌ మ్యాప్‌. ఆంధ్రుల తలమానికం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్‌. రైల్వే జోన్‌ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్‌. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం.. ఇదే విశాఖపై వైసీపీ విజన్‌.. ఎన్నికల ముందు పదేళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలకు తెరదీయడం నిజం కాదా..?” అంటూ షర్మిల(YS Sharmila) వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

Read Also: 50 ఏళ్లకే పింఛన్.. బీసీ డిక్లరేషన్‌ ప్రకటించిన టీడీపీ-జనసేన
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...